3 లక్షలకు చేరువైన కోవిడ్ మరణాలు

3 లక్షలకు చేరువైన  కోవిడ్ మరణాలు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 65 లక్షలు దాటింది. మరణాలు 3 లక్షలకు చేరువయ్యాయి. నిన్న 2 లక్షల 40 వేల 842 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 65 లక్షల 30 వేల 132కు చేరింది. దేశవ్యాప్తంగా 28 లక్షల 5 వేల 399 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి  2 కోట్ల 34 లక్షల 25 వేల 467 మంది కోలుకున్నారు. నిన్న 3,741 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం ఇప్పటివరకు కరోనా 2 లక్షల 99 వేల 266 మంది చనిపోయారని కేంద్రం తెలిపింది.