
హైదరాబాద్, వెలుగు: 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది ఎంట్రపెనార్లను తయారు చేయడంలో భాగంగా భారతదేశంలో తొలి డ్రేపర్ ఫౌండర్స్ ప్రోగ్రామ్ ప్రారంభించామని గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకోసిస్టమ్ డ్రేపర్ స్టార్టప్ హౌస్ తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా దీనిని 12 రోజులపాటు నిర్వహిస్తున్నామని ప్రకటించింది.
దేశం నలుమూలల నుంచి వచ్చిన 14 మంది స్టార్టప్ ఫౌండర్లను ఒకచోట చేర్చి, ప్రాక్టికల్ స్కిల్స్, మెంటారింగ్, గ్లోబల్ కనెక్టివిటీ అందిస్తారు. ఈ కార్యక్రమం వీరికి మెంటార్షిప్, వనరులు, నెట్వర్కింగ్ అవకాశాలను అందిస్తుంది. ఇది భారతదేశ స్టార్టప్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను తెలియజేస్తుందని డ్రేపర్ స్టార్టప్ హౌస్ తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా కొత్త ఆవిష్కరణలు, వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొంది.