టీమిండియా మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూత

 టీమిండియా మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్  కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్  కన్నుమూశారు. ఫిబ్రవరి 13 మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.  భారత్ తరఫున 11 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన  గైక్వాడ్  ..  1952, 1959లో ఇంగ్లాండ్, 1952-53లో వెస్టీండీస్ పర్యటనలకు వెళ్లిన జట్లలో సభ్యుడిగా ఉన్నారు. 1959లో భారత జట్టుకు నాయకత్వం కూడా వహించాడు.  52 పరుగులే గైక్వాడ్ టెస్ట్ కెరీర్ లో  సాధించిన ఏకైక అర్థసెంచరీ. 

దత్తా గైక్వాడ్ రంజీ ట్రోఫీలో 14 శతకాలతో 3 వేల 139 పరుగులు సాధించాడు. రంజీలో అతని అత్యధిక స్కోరు 249 పరుగులు.  1959-60లో మహారాష్ట్రపై సాధించారు.  ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 25 వికెట్లు సాధించాడు.   భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్‌గా సేవలందించిన అంశుమన్ గైక్వాడ్ దత్తా గైక్వాడ్ కుమారుడే. 1928, అక్టోబర్ 27న గుజరాత్ లోని వదోదరలో జన్మించారు దత్తా గైక్వాడ్  . గైక్వాడ్ తన 95వ పుట్టినరోజును అక్టోబర్ 27, 2023న జరుపుకున్నారు.