చరిత్ర సృష్టించిన ఇండిగో.. ఏడాదిలో వంద మిలియన్‌ మంది ప్రయాణం

చరిత్ర సృష్టించిన ఇండిగో.. ఏడాదిలో వంద మిలియన్‌ మంది ప్రయాణం

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ కొత్త చరిత్ర సృష్టించింది. ఏడాదిలో వంద మిలియన్‌ మంది ప్రయాణికులు(10 కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా ఇండిగో ఎయిర్ లైన్స్ రికార్డు సాధించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన తొలి భారతీయ విమానయాన సంస్థగా అవతరించడం ద్వారా ఇండిగో చరిత్ర సృష్టించింది అని ఆ సంస్థ చెప్పింది. దేశంలో ఇండిగో ఈ విజయం సాధించడం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద పది ఎయిర్‌లైన్స్‌ జాబితాలో చేరినట్లు చెప్పింది. 

ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పీటర్ ఎల్బర్స్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిలో 100 మిలియన్ల మంది ప్రయాణించిన చారిత్రక మైలురాయిని సాధించినందుకు చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు. తమ కస్టమర్లు చూపిన ప్రేమ, విశ్వాసం, ఇండిగో సహచరుల అభిరుచి, కృషి ఫలితంగా ఈ మైలురాయిని సాధించినట్లు చెప్పారు.