తిరుపతిలో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు

తిరుపతిలో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు

తిరుమల: తిరుపతిలో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో 40 నిమిషాల పాటు ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. తిరిగి తిరుపతిలోనే ఇండిగో విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అయింది. అయితే.. ఈ ఘటన తర్వాత ఎయిర్ పోర్ట్లో ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

మూడు రోజుల క్రితం కూడా ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. గాల్లో ఉండగానే ఫ్లైట్ ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పైలట్.. ప్యాన్ ప్యాన్ ప్యాన్ (ప్రాణాపాయం లేదు కానీ ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాలని పైలట్ పంపే సందేశం) అంటూ ఏటీసీకి సిగ్నల్ ఇచ్చాడు. ఏటీసీ నుంచి  క్లియరెన్స్ రావడంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది.

ఈ ఘటన బుధవారం (జూలై 16) రాత్రి జరిగింది. ఈ సమయంలో విమానంలో  191 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవా బయలుదేరింది. గాల్లో ఉండగానే ఇంజిన్ ఫెయిల్ కావడంతో ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం భువనేశ్వర్‌కు ఉత్తరాన 100 నాటికల్ మైళ్ల దూరంలో ఎగురుతున్నప్పుడు ఈ ఘటన జరిగిందని ముంబై విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఫ్లైట్ ఇంజిన్ నంబర్ 1లో సాంకేతిక లోపం తలెత్తిందని వివరించారు.