దివ్యాంగుడని చిన్నారిని విమానం ఎక్కనివ్వని ఇండిగో

దివ్యాంగుడని చిన్నారిని విమానం ఎక్కనివ్వని ఇండిగో

దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో సంస్థ విమానంలోకి అనుమతించని ఘటన రాంచీలో జరిగింది. చిన్నారి భయపడుతుండటంతో.. అతన్ని అనుమతించేందుకు నిరాకరించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. అయితే.. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండిగోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇండిగో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 



శనివారం రాంచీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఓ కుటుంబం తమ దివ్యాంగ చిన్నారితో కలిసి ఎయిర్ పోర్టుకు వచ్చింది. అయితే ఆ బాలున్ని విమానంలోకి అనుమతించేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని... ఆ కారణంగా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో చిన్నారిని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. దీంతో బాలుడి పేరెంట్స్ ప్రయాణాన్ని విరమించుకున్నారు. మనీషా గుప్తా అనే కో ప్యాసెంజర్ ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియో తన దృష్టికి రావడంతో స్పందించిన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇండిగోను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఇష్యూపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు తెలిపారు.