
న్యూఢిల్లీ: మనదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో పేరెంట్ కంపెనీ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ మార్చి 2025తో ముగిసిన క్వార్టర్లో రూ.3,067.5 కోట్ల నికరలాభం సాధించింది. ఏడాది లెక్కన ఇది 62 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
గత సంవత్సరం ఇదే కాలంలో పన్ను తర్వాత లాభం రూ.1,894.8 కోట్లుగా ఉంది. 2024–-25 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ.23,097.5 కోట్లకు పెరిగింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో రూ.18,505.1 కోట్లుగా ఉంది. 2024–-25లో ఈ విమానయాన సంస్థ 11.8 కోట్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించింది.
కంపెనీ బోర్డు రూ. 10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ. 10 చొప్పున డివిడెండ్ను సిఫార్సు చేసింది.