హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు

హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు

హెచ్ సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి.   ఐపీఎల్ టికెట్స్ ని బ్లాక్ లో విక్రయిస్తున్నారని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఐపీఎల్   టికెట్స్   విషయంలో జగన్ మోహన్ రావు అవకతవకలు పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు.  జగన్ మోహన్ రావుపై  సమగ్ర దర్యాప్తు జరిపించాలని పోలీసులను కోరారు శివసేన రెడ్డి.

మరో వైపు హెచ్ సీఏ ఐపీఎల్  టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ  యూత్ కాంగ్రెస్ నేతలు ఉప్పల్ స్టేడియం దగ్గర ఆందోళనకు దిగారు.  హెచ్ సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇవాళ రాత్రి సన్ రైజర్స్ ,బెంగళూరు మ్యాచ్ జరగనున్న క్రమంలో ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇదే విషయంపై ఐదు రోజుల క్రితం  ఉప్పల్ స్టేడియం ముందు ఆందోళన చేపట్టారు ఏఐవైఎఫ్ నేతలు. 20 నిమిషాల్లో 70 వేల టికెట్లు ఏవిధంగా అమ్ముడుపోయాయంటూ ప్రశ్నించారు.  క్రికెట్ అభిమానులకు  టికెట్లు దొరక్క ఇబ్బందిపడుతున్నారన్నారు. ఏప్రిల్ 25న జరిగే క్రికెట్ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.