వైజాగ్​లో ఇన్ఫోసిస్​ డెవలప్​మెంట్ సెంటర్​

వైజాగ్​లో ఇన్ఫోసిస్​ డెవలప్​మెంట్ సెంటర్​

ఐటీ మేజర్ ఇన్ఫోసిస్​ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని వైజాగ్​లో కొత్త డెవెలప్​మెంట్ సెంటర్​ను ప్రారంభించింది. దాదాపు 83,750 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెంటర్​ను ఏపీ సీఎం జగన్మోహన్​ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ వెయ్యి మంది పనిచేస్తారు. కొత్త ఆఫీసును హైబ్రిడ్​ వర్క్​ప్లేస్ ​స్ట్రాటజీకి అనుకూలంగా డెవెలప్​ చేశామని ఇన్ఫోసిస్​ ప్రకటించింది.