రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు మరోసారి అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు ఇచ్చిన హామీలకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించకపోవడం సరికాదన్నారు.
శుక్రవారం హైదరాబాద్లోని విద్యానగర్ బీసీ భవన్లో వివిధ బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా ఇవ్వలేదని ఫైర్అయ్యారు. కొత్త స్కీంలు లేవని, కొనసాగుతున్న స్కీంలకు బడ్జెట్ పెంచలేదన్నారు.
