నవీన్ చంద్ర లీడ్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. నందిని జె.ఎస్ దర్శకత్వంలో సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. సుఖ్ దేవ్ లాహిరి నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ చూసిన కాజల్ అగర్వాల్ చాలా ఇంటరెస్టింగ్గా ఉందని.. టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పింది.
ట్రైలర్ విషయానికొస్తే.. తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. జంతువుల కళేబరాలకు పట్టినట్లే మనుషుల శవాలకు పురుగుల గూడు అల్లుకుని ఉంటుంది. అడవిలో తిరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని ఊరి జనం చెబుతుంటారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సీబీ సీఐడీకి చేరుతుంది. ఈ హత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఆ ఊరికి వస్తాడు కొత్త ఇన్స్పెక్టర్ రిషి. ఊరి జనం మాటలు నమ్మని రిషి సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తనతో పాటు పోలీస్ టీమ్కు షాక్ అయ్యే విషయాలు తెలుస్తుంటాయి. ఈ కేసును రిషి ఎలా సాల్వ్ చేస్తాడనే అంశాలతో ఆసక్తికరంగా ట్రైలర్ సాగింది. మరోవైపు.. కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర ‘సత్యభామ’ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.