
రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ అనే వ్యక్తి 60 మంది అమ్మాయిల నుండి సుమారు 4 కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఇన్ స్టాగ్రామ్ లో అమ్మాయిలకు వల వేసి ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. బీటెక్ చదివిన వంశీకృష్ణ ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశాడు. ఆ ఫేక్ అకౌంట్లతో తనను తాను హై ప్రొఫైల్ వ్యక్తిగా క్రియేట్ చేసుకుంటూ.. టార్గెట్ చేసిన అమ్మాయిలతో చాటింగ్ చేశాడు. చాలా మంది అమ్మాయిలు అతని ఫ్రెండ్ షిప్ కోసం తపిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. ఈ విధంగా 60 మంది అమ్మాయిలను మోసం చేసి సుమారు 4 కోట్ల రూపాయల కొట్టేశాడు.
ఈ ఘరానా మోసంలో అమెరికాలో ఉండే హైదరాబాద్ కి చెందిన యువతి రూ. 25 లక్షలు మోసపోయింది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ యువతి పిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిటీ వారెంట్ పై వంశీ కృష్ణని అదువులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. వంశీకృష్ణపై గతంలో రాచకొండ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, వైజాగ్, కరీంనగర్, విజయవాడలలో ఈ తరహా పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.