ఇంటర్ అడ్మిషన్ల అప్లికేషన్ గడువు పెంపు

ఇంటర్ అడ్మిషన్ల అప్లికేషన్ గడువు పెంపు

టెన్త్ పూర్తి చేసుకుని ఇంటర్ లో చేరే స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్ బోర్డు. ఇంటర్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కోసం అప్లికేషన్ల గడువును జులై 31 వరకు పెంచుతున్నట్లు సర్క్యులర్ జారీ చేసింది.  

జూన్ 27న పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో పాసైన విద్యార్థులు.. జులై 31 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్లు పొందేలా గడువు పెంచింది ఇంటర్ బోర్డు. జులై 31 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్ల గడువు పెంపు ఉండదన్న స్పష్టం చేసింది. 

Also Read : 9999 నంబర్కు రూ. 12 లక్షలు..కొన్నది ఎవరంటే.?

ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఉన్న కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్లు తీసుకోవాలని ఈ సందర్భంగా పేరెంట్స్ కు సూచించారు అధికారులు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల లిస్ట్ అందుబాటులో ఉంటుందని సెక్రెటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.