ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ సీపీఐ చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని ఖైరతాబాద్ సర్కిల్ లో పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యులుగా మంత్రి జగదీశ్ రెడ్డి, బోర్డు కార్యదర్శిలను తొలగించాలని డిమాండ్ చేశారు సీపీఐ నేతలు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
