అవార్డులు బాధ్యతను పెంచుతయ్ : సామల వేణు

అవార్డులు బాధ్యతను పెంచుతయ్ : సామల వేణు

సికింద్రాబాద్,వెలుగు : తన సేవలను గుర్తించి కాపు రత్న అవార్డు ఇవ్వడం సంతోషంగా, గర్వంగా ఉందని ఇంటర్నేషనల్ మెజీషియన్ సామల వేణు అన్నారు. అవార్డులు మరింత బాధ్యత పెంచుతాయన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని ఓ హోటల్ లో ఆల్ ఇండియా తెలగ బలిజ కాపు సంఘం ఆధ్వర్యంలో కాపురత్న పురస్కార అవార్డుల కార్యక్రమం సంఘం అధ్యక్షుడు కోటెల్ల శ్రీహరి అధ్యక్షతన జరిగింది. 

సామల వేణుతోపాటు వివిధ రంగాల్లో రాణించిన వారిని గుర్తించి కాపు రత్న, సేవా పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులను ఏకం చేసేందుకు 1959లో లోయర్ ట్యాంక్ బ్యాండ్ లో ఏర్పాటైన ఆల్ ఇండియా తెలగ బలిజ కాపు సంఘం స్థలంలో సరికొత్త హంగులతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.  కాపులు సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సంఘం నేతలు ఎస్ వీ రావు, జవహర్, మరీశ్వరరావు, పి. వినాయక స్వామి, రమణారావు, శంకర్ బాబు, చందు జనార్దన్  పాల్గొన్నారు.