
ఖైరతాబాద్, వెలుగు: ప్రపంచ దేశాల్లో ఎంతో గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ థైక్వాండో చాంపియన్షిప్ లీగ్(ఐటీసీఎల్) పోటీలను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఇంటర్నేషనల్ మెజీషియన్సామల వేణు తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని 206 దేశాల్లో ఈ మార్షల్ఆర్ట్స్క్రీడకు ఎంతో ఆదరణ ఉందని పేర్కొన్నారు. అంతటి ఆదరణ పొందిన క్రీడను దేశంలోనే హైదరాబాద్లో తన ఆధ్వర్యంలో తొలిసారిగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో శ్రీనగర్ టీమ్కు యజమానిగా ఉన్నానని చెప్పారు. ఈ నెల12,13,14 తేదీల్లో మూడ్రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 వరకు జరుగుతాయన్నారు. క్రీడలపై మక్కువ ఉన్నవారు ఎవరైనా రావొచ్చని , ఎంట్రీకి ఎలాంటి ఫీజు లేదన్నారు. మొత్తం 12 టీమ్స్ క్రీడల్లో పాల్గొంటున్నాయని, ఒక్కో టీమ్లో 5 మంది సభ్యులు ఉంటారన్నారు. పోటీలు ముగింపు రోజు14న అబ్దుల్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్అబ్దుల్లా హాజరై విజేతలకు బహుమతులు, మెడల్స్ అందజేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఐటీ హెడ్మకరంద్, డైరెక్టర్స్ గిరిబాబు, సీహెచ్ సుప్రియ పాల్గొన్నారు.