అన్నమయ్య జిల్లా: అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అన్నమయ్య జిల్లా: అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

 జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి మదనపల్లి.. కురబలకోట మండలాల్లో  భారీగా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డ ఆరుగురు సభ్యుల అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 20 లక్షల విలువ చేసే, 150 గ్రాముల బంగారం, 762 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 5, 28 లక్షల నగదును సీజ్​ చేసినట్లు  డిఎస్పి మహేంద్ర తెలిపారు. 

 అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం, చేనేత నగర్ బస్ స్టాప్ వద్ద ఈనెల 14న ఆరుగురు అనుమానస్పద స్థితిలో ఉండగా పట్టుకుని వారిని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. పట్టుబడిన వారిలో   మదనపల్లి టిఎన్ఆర్ కాలనీకి చెందిన మౌలాలి అలియాస్ బాబు (52),  కర్ణాటక రాష్ట్రం చింతామణి  జోగుల గడ్డకు చెందిన శంకర్ (48), కురపలకోట నంది రెడ్డి గారి పల్లికి చెందిన నరసింహులు(45), మదనపల్లి బొమ్మన్చెరు పాకాల వారి పల్లికి చెందిన నవీన్ కుమార్ (30), కృపలకోట చింతమకులపల్లి కు చెందిన అనంత విశ్వనాథరెడ్డి (65), గంగవరం మండలం, మాడుగురుకు చెందిన నిరుగట్టి రమేష్( 44)  ఉన్నారు.

తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవారని చెప్పారు.  చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డ వీరు వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి పక్కా వ్యూహంతో దోపిడీలు చేయడం అలవాటు చేసుకున్నారు. అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన  మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, క్రైమ్ సీఐ చంద్రశేఖర్, ముదివేడి ఎస్ఐ దిలీప్ కుమార్, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరందరికీ క్యాష్‌ రివార్డులను ఎస్పీ అందించారు.