పద్మారావునగర్, వెలుగు: అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా గుట్టును రైల్వే పోలీసులు రట్టు చేశాయి. ఒడిశా నుంచి సికింద్రాబాద్ మీదుగా పుణెకు గంజాయి తరలిస్తున్న బిహార్కు చెందిన జవహర్ కుమార్ (32)ను సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 7.16 లక్షల విలువైన 14.32 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న జవహర్కు.. అఖిలేశ్ కుమార్ అనే స్మగ్లర్తో పరిచయం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జవహర్కు గంజాయి పార్శిల్ చేరవేస్తే ట్రిప్పుకు రూ.7 వేలు ఇస్తానని అఖిలేష్ ఆశ చూపాడు. దీంతో అక్రమ రవాణాకు అంగీకరించిన జవహర్.. విశాఖ ఎక్స్ప్రెస్లో గంజాయి సూట్కేస్తో సికింద్రాబాద్ చేరుకున్నాడు. సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడి సూట్కేస్ తెరిచి చూడగా భారీగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
