దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో విచారణ పూర్తయింది : డీజీపీ మహేందర్ రెడ్డి

దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో విచారణ పూర్తయింది : డీజీపీ మహేందర్ రెడ్డి

అధికార దుర్వినియోగం, క్రమశిక్షణ ఉల్లంఘించిన పోలీస్ ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో విచారణ పూర్తైందని స్పష్టం చేశారు. దిశ కమిషన్ రిపోర్ట్ హైకోర్టుకి ఇచ్చిందని, ప్రస్తుతం ఆ అంశం హైకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్న ఆయన.. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని అన్నారు.

ఈ నెల 31 తేదీన తాను రిటైర్డ్ అవుతున్నానని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. తన కెరియర్ లో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గత 8 ఏళ్లలో తనకు సహకరించిన ప్రభుత్వం, మీడియా, ప్రజలు, సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. 2017 నవంబరు 17న మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఏప్రిల్ 8, 2020న దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారుల జాబితాలో మహేందర్ రెడ్డి 8వ స్థానం దక్కించుకున్నారు.