
ముంబై: వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లు పడ్డాయి. బెంచ్మార్క్ స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం ఒకశాతం పతనమయ్యాయి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూ-చిప్ల షేర్లలో ప్రాఫిట్బుకింగ్ఇండెక్స్లను కిందకు లాగింది. దీంతో సెన్సెక్స్ 872.98 పాయింట్లు పతనమై 81,186.44 వద్ద స్థిరపడింది. ఇందులోని 27 షేర్లు నష్టాలతో, మూడు లాభాలతో ముగిశాయి.
ఇంట్రాడేలో ఆటో, ఫైనాన్షియల్, డిఫెన్స్ స్టాక్లలో ప్రాఫిట్బుకింగ్వల్ల 905.72 పాయింట్లు పడిపోయి 81,153.70కి చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 261.55 పాయింట్లు పడిపోయి 24,683.90కి చేరుకుంది. దీంతో పెట్టుబడిదారుల సంపద రూ.5.64 లక్షల కోట్లు తగ్గింది. భారత్,-అమెరికా వాణిజ్య ఒప్పందంపై మరింత స్పష్టత కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తూ లాభాల బుకింగ్ను ఎంచుకున్నారని ఎనలిస్టులు తెలిపారు.
సెన్సెక్స్ సంస్థలలో, ఎటర్నల్ అత్యధికంగా 4.10 శాతం పడిపోయింది. మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనిలీవర్, ఆసియన్ పెయింట్స్ కూడా వెనకబడి ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.26 శాతం, ఇండెక్స్ మేజర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.13 శాతం తగ్గాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఐటీసీ లాభపడ్డాయి.
బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 1.65 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.96 శాతం పడిపోయాయి. పాజిటివ్ ట్రిగ్గర్లు లేకపోవడానికి తోడు యూఎస్ ఆర్థిక స్థిరత్వంపై అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్ను ఎంచుకున్నారని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు.
సెక్టోరల్ సూచీలన్నీ నష్టాల్లోనే..
బీఎస్ఈలో అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఆటో 2.13 శాతం, కన్జూమర్ డిస్క్రెషనరీ 1.81 శాతం, యుటిలిటీస్ 1.64 శాతం, సేవలు 1.53 శాతం, ఇండస్ట్రియల్1.36 శాతం, టెలికమ్యూనికేషన్ 1.35 శాతం పడ్డాయి. బీఎస్ఈలో 2,531 స్టాక్లు క్షీణించగా, 1,438 లాభాలు సంపాదించాయి. ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ లాభాల్లో ముగియగా, దక్షిణ కొరియా కోస్పి స్వల్పంగా నష్టపోయింది.
యూరప్ మార్కెట్లు గ్రీన్లో ట్రేడవుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.11 శాతం తగ్గి బ్యారెల్కు 65.47 డాలర్లకు చేరుకుంది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) సోమవారం రూ.525.95 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. సోమవారం సెన్సెక్స్ 271.17 పాయింట్లు తగ్గి 82,059.42 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 74.35 పాయింట్లు తగ్గి 24,945.45 వద్ద సెటిలయింది.