IPL -2020: ఢిల్లీపై 9 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం

IPL -2020: ఢిల్లీపై 9 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం

IPL -2020 సీజన్ లో ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. దుబాయ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 111 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై 14.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి విక్టరీని సాధించింది.

ఓపెనర్ ఇషాన్ కిషన్ చెలరేగడంతో ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేశారు. రబాడా, నోర్జే, అశ్విన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. డికాక్ 26 రన్స్ చేసి అవుట్ కాగా… కిషన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 72 పరుగులు సాధించాడు. చివర్లో సిక్స్ కొట్టి ముంబై ఇండియన్స్ ను గెలిపించాడు. ఈ విక్టరీతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్-1 లో నిలిచింది.

ఢిల్లీ బౌలర్లలో నోర్జే ఒక వికెట్ సాధించాడు.