IPL 2024 : చెన్నైలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్

IPL 2024  : చెన్నైలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్స్ మ్యాచ్ చెన్నైలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా బీసీసీఐ తొలి 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజాగా పూర్తి షెడ్యూల్ ను  రెడీ చేసినట్లుగా సమాచారం. మే 26న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్  చెన్నైలో జరగడం దాదాపుగా ఖాయమని  బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 

 ఇక దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం లో ఒక క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుందని వెల్లడించారు. మరో క్వాలిఫైయర్ చెన్నైలో జరగనుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తేదీలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ ఐపీఎల్‌లోని మిగిలిన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇక ఐపీఎల్ లో  ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మధ్యాహ్నం 3:30 గంటల నుంచి జైపూర్‌లో జరగనుంది. రెండో మ్యాచులో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. అహ్మదాబాద్‌లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. జియో సినిమా యాప్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ఈ మ్యాచులను వీక్షించవచ్చు.