Preity Zinta: రోహిత్ కోసం జీవితాన్ని పందెం కాస్తా! పుకార్లపై ప్రీతి జింటా సీరియస్

Preity Zinta: రోహిత్ కోసం జీవితాన్ని పందెం కాస్తా! పుకార్లపై ప్రీతి జింటా సీరియస్

ఐపీఎల్ 2024 సీజన్ అనంతరం రోహిత్ శర్మ.. ముంబై జట్టును వీడనున్నారంటూ టోర్నీ ప్రారంభం నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిల్‌ అందించిన తనకు కాదని.. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించడంపై హిట్‌మ్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ముంబై యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అతని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయినట్లు జాతీయ మీడియా కూడా కోడైకూసింది. అందువల్లే, అతను సీజన్ ముగిసిన అనంతరం ముంబై జట్టును వీడటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. 

Also Read:DRS చీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు బీసీసీఐ భారీ జరిమానా

2025 వేలంలోకి హిట్ మ్యాన్

రాబోవు సీజన్ కోసం వచ్చే ఏడాది జనవరి చివరలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో వేలం నిర్వహించేందుకే నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఆ వేలంలో రోహిత్ శర్మ పాల్గొంటే.. అతన్ని చేజిక్కించుకునేందుకు ఢిల్లీ, గుజ‌రాత్‌, పంజాబ్‌‌తో పాటు ఇత‌ర ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా రోహిత్‌ను ద‌క్కించుకునేందుకు పంజాబ్‌ సహా యజమాని ప్రీతీ జింటా తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు మీడియాలో కథనాలొచ్చాయి. అతని కోసం త‌న జీవితాన్ని పందెంగా కాయడానికైనా సిద్ధమని ప్రీతి జింటా వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. చివరకి అవన్నీ ఈ అందాల ముద్దుగుమ్మ చెవిన పడటంతో.. బోరుమని విలపించింది. అవన్నీ పుకార్లనీ కొట్టి పారేసింది.  

సోషల్ మీడియాలో ప్రకటన

వేలంలో పాల్గొంటే.. రోహిత్‌ శర్మను కొనుగోలు చేసేందుకు తాము సిద్ధమని జ‌రుగుతోన్న ప్రచారంలో నిజం లేద‌ని ప్రీతి జింటా క్లారిటీ ఇచ్చింది. రోహిత్ గురించి తాను ఏ ఇంట‌ర్వ్యూలో ఎలాంటి కామెంట్స్ చేయ‌లేద‌ని, ఎలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వలేద‌ని తెలిపింది. అతని అభిమానుల్లో తాను ఒక‌రిన‌ని, అత‌ని ఆటంటే తనకు చాలా ఇష్టమ‌నివెల్లడించింది. ఈ మేరకు తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఫేక్ వార్తలను ఖండించింది.