ఇప్పట్లో క్రికెట్ కష్టమా.. : డైలమాలో టీమిండియా బంగ్లా టూర్, ఆసియా కప్

ఇప్పట్లో క్రికెట్ కష్టమా.. : డైలమాలో టీమిండియా బంగ్లా టూర్, ఆసియా కప్

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ చెప్పినప్పటికీ  ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్ ఇప్పట్లో తిరిగి మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు.  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణపైనా నీలి నీడలు కమ్ముకున్నాయి. దాంతో  ఈనెలలో సాధ్యం కాకపోవడంతో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిగిలిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జరిగే విండోలో నిర్వహించే అవకాశం ఉంది.

ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తటస్థ వేదికపై జరగాల్సి ఉంది. ఈ టోర్నీ కోసం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 19 రోజుల విండో  కేటాయించారు. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా–పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనీసం రెండు సార్లు, ఫైనల్లోనూ  తలపడే చాన్సుంది. అయితే, అద్భుతం జరిగితే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశం కనిపించడం లేదు.

ఆగస్టు చివరి వరకూ కష్టమే!

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్ అస్తవ్యస్తమైన నేపథ్యంలో లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసేందుకు బోర్డు ఇతర ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించాల్సి ఉంది.  టీమిండియా జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు మొదటి వారం వరకు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటిస్తుంది, ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చడం సాధ్యం కాదు. ఆగస్టులో ఇండియా.. ఆరు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వైట్-బాల్ సిరీస్ కోసం  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగే చాన్స్ లేదు. కాబట్టి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ఆగస్టు 5 నుంచి 31 వరకు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడే చాలా మంది టాప్ టీ20 ఆటగాళ్లు పాల్గొంటారు. 

అదే సమయంలో ఆగస్టులో ఆస్ట్రేలియా–-సౌతాఫ్రికా మధ్య ఆరు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వైట్-బాల్ సిరీస్ జరుగుతుంది. ఈ కారణంగా ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండరు. పైగా, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీ ఓనర్లైన రిలయన్స్, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్జీ  గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ‘ది హండ్రెడ్’లో పెట్టుబడులు పెట్టాయి. కాబట్టి ఆగస్టు నెలాఖరు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా లేదు.