రీసెంట్గా ‘జవాన్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నయనతార ఇప్పుడొక డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జయం రవితో నయనతార నటించిన సైకో థ్రిల్లర్ ‘ఇరైవన్’ సినిమా ‘గాడ్’ టైటిల్తో తెలుగులో విడుదలవుతోంది. అహ్మద్ దర్శకత్వంలో సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మించారు.
నేడు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘గత నెలలో తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఈ చిత్రంతో మరొక సక్సెస్ను అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులను కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా మెప్పిస్తుంది’ అన్నారు. ఇందులో ఆశిష్ విద్యార్థి, నరేన్, చార్లి, వినోద్ కిషన్ కీలక పాత్రలు పోషించారు.