రైలు ప్రయాణికుడి గొంతులోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్

రైలు ప్రయాణికుడి గొంతులోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్

రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి కిటీకీలోనుంచి అకస్మాత్తుగా వచ్చిన ఓ ఇనుప రాడ్ గొంతులో గుచ్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీ-- కాన్పూర్ వెళ్లే నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ (12876)లో ఉ.8.15గంటలకు చోటు చేసుకుంది. అనంతరం రైలును అలీఘర్ జంక్షన్‌లో నిలిపివేసి, మృతదేహాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు. అయితే మృతి చెందిన వ్యక్తిని సుల్తాన్‌పూర్ జిల్లాలోని గోపీనాథ్‌పూర్‌కు చెందిన హరికేష్ కుమార్ దూబేగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని భారతీయ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

రైలు పక్కనే రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఈ సమయంలోనే ఓ ఇనుపరాడ్ పక్కనే రైల్లో కిటీకీ అద్దాలు పగలగొట్టుకొని రైల్లో కూర్చొని ఉన్న దూబే గొంతులోకి దూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదృష్టవశాత్తు పక్కనే ఉన్న ఇంకెవరికీ ప్రమాదం జరగకపోవడం గమనార్హం. అయితే ఈ సంఘటన పక్కనే ఉన్న రైల్వే పనుల వల్ల కాలేదని  రైల్వే అధికారులు వారించారు.