లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన  ఇరిగేషన్  డీఈ

అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ఇరిగేషన్​ డీఈ శ్రీకాంత్  నాయుడు గురువారం రూ.11 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్  బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అలంపూర్ కు చెందిన ఓ కాంట్రాక్టర్  చేసిన పనికి సంబంధించిన ఎంబీ రికార్డ్  చేయడానికి డీఈ రూ.12వేలు డిమాండ్  చేశాడు. 

చివరకు రూ.11 వేలు లంచం ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించి, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు అలంపూర్  పట్టణంలోని ఇరిగేషన్  ఆఫీస్​లో డీఈ శ్రీకాంత్ నాయుడుకు డబ్బులు ఇవ్వగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీఈని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఇన్స్​పెక్టర్  సయ్యద్  ఖాదర్  జిలాని, సిబ్బంది పాల్గొన్నారు.