హైదరాబాద్, వెలుగు: భద్రాచలం, దాని సమీప ప్రాంతాలను పోలవరం బ్యాక్ వాటర్, గోదావరి వరదల నుంచి రక్షించడానికి చేపట్టాల్సిన చర్యలపై స్టడీ చేయాలని ఇరిగేషన్డిపార్ట్మెంట్నిర్ణయించింది. దానికోసం కొత్తగా టెక్నికల్కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకిచైర్మన్గా ఈఎన్సీ నాగేందర్, ప్రాజెక్ట్అండ్మెయింటనెన్స్ఎస్ఈ శ్రీనివాస్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. సెంట్రల్డిజైన్ఆర్గనైజేషన్ సీఈ చంద్రశేఖర్, రిటైర్డ్ఈఎన్సీ రాజరాజుతో పాటు పలువురు నిపుణులను సభ్యులుగా నియమించారు.
ఈ కమిటీ ఈ నెల 16 నుంచి 18 వరకు ఒడిశాలోని మహానది బేసిన్, 20 నుంచి 22 వరకు బ్రహ్మపుత్ర బేసిన్, 29 నుంచి 31 వరకు ఉత్తరప్రదేశ్లోని గంగానది బేసిన్ప్రాంతాల్లో పర్యటించనుంది. 2022తోపాటు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా కురిసిన వర్షాలకు భద్రాచలం పరిసర ఏరియాలు పది రోజులకు పైగా నీట మునిగాయి. దీంతో భద్రాచలంతో పాటు మణుగూరు హెవీ వాటర్ప్లాంట్, సారపాక ఐటీసీ సహా పరిసర గ్రామాలు నీట మునగకుండా శాశ్వత చర్యలకు ఇరిగేషన్డిపార్ట్మెంట్ఉపక్రమించింది. వరదల నుంచి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనే దానిపై ఈ కమిటీ రిపోర్టు రెడీ చేసి సర్కారుకు ఇవ్వనున్నది.