కాళేశ్వరం బ్యారేజీలపై ఏం చేద్దాం?

కాళేశ్వరం బ్యారేజీలపై ఏం చేద్దాం?
  • అధికారులతో ఇరిగేషన్​శాఖ ముఖ్య కార్యదర్శి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలపై సర్కారు దృష్టి సారించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) ఫైనల్​ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్టు ఆధారంగా ఏం చేయాలన్న దానిపై సోమవారం ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా.. ఆ శాఖ​అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణ సంస్థలూ సమీక్షలో పాల్గొన్నట్టు తెలిసింది. 

బ్యారేజీల వద్ద చేయాల్సిన టెస్టులు, ఇన్వెస్టిగేషన్స్​ వంటి అంశాలపై రాహుల్​ బొజ్జా ఆరా తీసినట్టు సమాచారం. బ్యారేజీల రిపేర్లకు చేపట్టాల్సిన చర్యలు, మేడిగడ్డ ఏడో బ్లాక్​ పునరుద్ధరణ తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. కాగా, ఇటీవల కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్​డీఎస్​ఏ తుది నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ ఏడో బ్యారేజీని పూర్తిగా తొలగించి కొత్తగా కట్టాలని చెప్పడంతోపాటు.. మూడు బ్యారేజీలకు రీహాబిలిటేషన్​ డిజైన్లను సూచించింది.