తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో వైస్ చైర్మన్ ఉమా మహేశ్వరన్. రేపు సాయంత్రం శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న GSLV-F10 నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రయోగం విజయవంతం కావాలని మొక్కుకున్నారు. ఈ ఉపగ్రహం భారత ఉపఖండాన్ని నిరంతరం పరిశీలిస్తూ వాస్తవ సమయాన్ని తెలుపుతుందున్నారు. రక్షణ రంగానికి ఉపయోగపడనుందని చెప్పారు.