22 న ఇస్రో మరో రాకెట్ ప్రయోగం

22 న ఇస్రో  మరో రాకెట్ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో వాణిజ్యప్రయోగానికి సిద్ధమవుతోంది. పూర్తి విదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన సింగపూర్ కి చెందిన లియోస్-2 ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదికపై PSLV C_55 వాహకనౌక అనుసంధానం పూర్తయింది. ఈనెల 22న మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఇందులో రాకెట్ దశలవారీ అమరిక, ఉపగ్రహాల అనుసంధానం, రిహార్సల్లో గుర్తించిన అంశాలపై చర్చించి ప్రయోగానికి పచ్చజెండా ఊపనున్నారు. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్-2.. 16 కిలోల లూమెలైట్-4ను వాహకనౌక కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ప్రయోగానికి సంభందించి గతనెల 10న పీఎస్ఎల్వీ-సి55 అనుసంధానం పీఐఎఫ్ లో ప్రారంభమైంది. అక్కడ రాకెట్లోని రెండు దశలను పూర్తిచేసి మొదటి ప్రయోగ వేదికకు ఈనెల 5న తీసుకొచ్చారు. ఇక్కడ మూడు, నాలుగు దశల అనుసంధానం చేపట్టిన తర్వాత ఉష్ణకవచంలో (హీట్షీల్డు) సింగపూర్‌ టెలియన్ ప్రవేశపెట్టబోతున్నారు.ఇది ముగిసిన తర్వాత ప్రయోగానికి ముందు 25.30 గంటలపాటు కౌంట్ డౌన్ నిర్వహించేలా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెలరోజులు పూర్తి కాకముందే మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం చేసి ప్రయోగించడం మరో రికార్డును సొంతం చేసుకోబోతుంది