ఆగస్టులో చంద్రయాన్ 3 ప్రయోగం నిర్వహించనున్న ఇస్రో

ఆగస్టులో చంద్రయాన్ 3 ప్రయోగం నిర్వహించనున్న ఇస్రో

చంద్రయాన్- 2తో చంద్రుడిపై  దిగాలన్న భారత్ కల కల్లలై దాదాపు రెండేళ్లయిపోయింది. జాబిల్లిపై భారత సంతకం ఉంటుందని సంబరపడిపోయిన ప్రతి భారతీయుడి ఆశ చెదిరిపోయింది. అయితే.. ఇప్పుడు ఆ నిరాశ నుంచి రెట్టింపు ఆశలతో మరో చందమామ ప్రయోగానికి భారత్ సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఈ ఏడాదే చేపట్టేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది ఆగస్టులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)చంద్రయాన్ 3 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని అంతరిక్ష ప్రయోగాల శాఖ (స్పేస్ డిపార్ట్ మెంట్) తెలిపింది. చందమామ ప్రయోగం, ఆ ప్రయోగం ఆలస్యం కావడంపై లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. చంద్రయాన్ 2 వైఫల్యం నేర్పిన పాఠాలు, అంతర్జాతీయ నిపుణుల సలహాలను తీసుకుంటూ చంద్రయాన్ 3 మిషన్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే దానికి అవసరమైన పరీక్షలన్నీ పూర్తయ్యాయని తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా షెడ్యూల్ లో పెట్టిన ప్రయోగాలే ఆలస్యమవుతున్నాయని చెప్పారు. అయితే, ప్రస్తుతం డిమాండ్ ప్రాతిపదికన ప్రయోగాలకు ప్రాధాన్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2008 అక్టోబర్ లో ప్రయోగించిన చంద్రయాన్ మిషన్ ద్వారా తెలిసిన విషయాల ఆధారంగా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేయబోతున్నట్టు తెలిపారు. వాస్తవానికి గతేడాదే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నా.. కరోనా తో  వాయిదా పడింది.

మరిన్ని వార్తల కోసం...

కేసీఆర్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలి