రేపు విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం

రేపు విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం

దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు అంతా సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 18న రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాకెట్ ను ప్రయోగించనున్నారు.

ఈ రాకెట్ కు విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు.స్టార్టప్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్ ను రూపొందించింది. సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు విక్రమ్–ఎస్ ను అభివృద్ధి చేశారు. 2.5 కేజీల రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను రాకెట్ కక్షలోకి తీసుకెళ్లనుంది.