ఆర్థిక ఇబ్బందులతో ఐటీ ఎంప్లాయ్ సూసైడ్

ఆర్థిక ఇబ్బందులతో ఐటీ ఎంప్లాయ్ సూసైడ్
  • బాచుపల్లి పీఎస్ పరిధిలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఐటీ ఎంప్లాయ్  సూసైడ్ చేసుకున్న   ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతినగర్​కు చెందిన కరణం మహేశ్(32) సాఫ్ట్​వేర్ ఎంప్లాయ్​గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. 

ఈ నెల 26న అతడి భార్యాపిల్లలు పుట్టింటికి వెళ్లారు. బుధవారం మహేశ్ సెల్​ఫోన్​లో  సెల్ఫీ వీడియో రికార్డ్ ఆన్ చేసి.. ఆర్థిక ఇబ్బందులతో తాను చనిపోతున్నానంటూ ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేశారు.