- బాచుపల్లి పీఎస్ పరిధిలో ఘటన
జీడిమెట్ల, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఐటీ ఎంప్లాయ్ సూసైడ్ చేసుకున్న ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతినగర్కు చెందిన కరణం మహేశ్(32) సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు.
ఈ నెల 26న అతడి భార్యాపిల్లలు పుట్టింటికి వెళ్లారు. బుధవారం మహేశ్ సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో రికార్డ్ ఆన్ చేసి.. ఆర్థిక ఇబ్బందులతో తాను చనిపోతున్నానంటూ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేశారు.