కాక్రోచ్ పార్టీతో మోదీ పాలన ఏందో తేలిపోయింది.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

కాక్రోచ్ పార్టీతో మోదీ పాలన ఏందో తేలిపోయింది.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాక్రోచ్ పార్టీతో దేశంలో మోదీ పాలన ఏందో తేలిపోయిందని, ఆయన ఇమేజ్​ను కాక్రోచ్ దాటిపోయిందని కాంగ్రెస్ సీనియర్‌‌‌‌ నేత జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. 

కాక్రోచ్​కు రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వాలని, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చిన్న స్థాయి నేతను మాత్రమేనని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాహుల్ గాంధీయేనని అన్నారు. కాక్రోచ్​తో మోదీకి పాలన మీద పట్టులేదని తేలిపోయిందన్నారు.