హైదరాబాద్, వెలుగు: జూబ్లీ హిల్స్ నుంచి మజ్లిస్ మొదటిసారిగా మహిళను అభ్యర్థిగా ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. పార్టీ చరిత్రలోనే మహిళను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దింపాలని భావిస్తున్నట్టు ఆపార్టీ వర్గాల సమాచారం. జాతీయ కరాటే చాంపియన్ సయ్యదా ఫలక్ను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతుంది.
తద్వారా మహిళా, మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. 3 ఏళ్ల కిందటపార్టీలో చేరిన సయ్యదా ప్రజా సమస్యలపై కూడా పోరాడినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక క్రీడాకారుడిపై పోటీగా మరో క్రీడాకారిణిని బరిలోకి దించితే బాగుంటుందని మజ్లిస్భావిస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే జూబ్లీహిల్స్ ఎన్నికల పోరు ఆసక్తి కరంగా మారుతుంది.