అంబేద్కర్ కు నివాళి అర్పించే సమయం కేసీఆర్ కు లేదా

అంబేద్కర్ కు నివాళి అర్పించే సమయం కేసీఆర్ కు లేదా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసమే పీవీ నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించారన్నారు. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అంబేద్కర్‌ 130వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడారు. బీజేపీ పంచ తీర్థాల పేరుతో అంబేద్కర్ ను గౌరవిస్తుంటే..దానికి   భిన్నంగా రాష్ట్రంలో అంబేద్కర్ ను కనీసం స్మరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవాళ సాయంత్రం  లక్ష మందితో సభలు సమావేశాలు పెట్టడానికి సీఎం కేసీఆర్ టైమ్ ఉంటుంది కానీ.. అంబేద్కర్ కు కు నివాళి అర్పించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు పోరాటం చేస్తే ఒక్కరు కేటీఆర్ గడి నుండి బయటకి వచ్చాడు. కేసీఆర్ ను కూడా  గడి నుండి  బయటికి తీసుకు వచ్చే రోజులు దగ్గర పడ్డాయన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎందుకు నిర్మించడంలేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా దళిత సంఘాలు పార్టీలను పక్కకు పెట్టి ..గడిలో బందీ అయిన తెలంగాణ విముక్తి కోసం ప్రతిజ్ఞ తీసుకుని  పోరాటం చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.