ముంబైలో వరుణుడి బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ

ముంబైలో వరుణుడి బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరం అతలాకుతలమైంది. మంగళవారంతో పాటు బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.

భారీ వర్షాల దాటికి మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో నదులు, డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో పలు ముంపు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.