అమ్మవార్లకు కేజీ స్వర్ణ కిరీటం తయారు చేయిస్తం : హరీష్ రావు

అమ్మవార్లకు కేజీ స్వర్ణ కిరీటం తయారు చేయిస్తం   : హరీష్ రావు

వచ్చే సంవత్సరం కొమురవెల్లి మల్లన్న కల్యాణం వరకు అమ్మవార్లకు కేజీ స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. అశేష జనవాహిని సమక్షంలో మల్లన్న కల్యాణం జరగడం చాలా సంతోషమని హర్షం చేశారు. సీఎం కేసీఆర్ మల్లన్న ఆలయానికి రూ.30కోట్ల రూపాయలు కేటాయించారన్న మంత్రి హరీశ్ రావు.. రూ.1100కోట్ల రూపాయలతో యాదాద్రి నిర్మాణం జరగడం సంతోషకరమన్నారు. కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించారని, మల్లన్నకు కిలోన్నర స్వర్ణ కిరీటం చేయించడం జరిగిందని చెప్పారు.

కొందరు కుట్రలు చేసినా మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తయిందని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు తెలిపారు. మల్లన్న సాగర్ తో పలు జిల్లాలు సస్యశ్యామలం చేశామని,  గోదావరి జలాలతో సీఎం కేసీఆర్ మల్లన్నకు అభిషేకం చేశారని చెప్పారు. క్యూలైన్ ఏర్పాటుకు రూ.11కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.