పాతబస్తీలో ఐటీ దాడులు..

 పాతబస్తీలో ఐటీ దాడులు..

హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకుర్చుతున్నట్లు సమాచారం అందడంతో పాతబస్తీలోని బడా వ్యాపాస్తుల ఇళ్లలో ఐటీ సోదాలు చేపట్టింది. 2023, నవంబర్ 25వ తేదీ శనివారం తెల్లవారుజాము నుంచి ఫలక్ నామలోనీ కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్ వాజ్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. శాన్ వాజ్ ఇంటితోపాటు ఆయన సంబంధించిన ఫంక్షన్ హాల్ ఆఫీస్, హోటల్స్ లో ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ తో కలిసి సోదాలు చేస్తున్నారు.

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ నివాసంలో కూడా నిన్న(నవంబర్ 24) రాత్రి తనిఖీలు చేశారు.  జూబ్లీహిల్స్ లోని ఏకే గోయల్ ఇంట్లో  ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.