సీఆర్పీఎఫ్ సెక్యూరిటీతో మల్లారెడ్డి బంధువుల ఇంట్లో ఐటీ దాడులు

సీఆర్పీఎఫ్ సెక్యూరిటీతో మల్లారెడ్డి బంధువుల ఇంట్లో ఐటీ దాడులు

మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసులు,యూనివర్సిటీ, కాలేజీలతో పాటు సంబంధీకుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు 7 గంటలుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు చేస్తోంది. మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన లావాదేవీలన్నీ క్రాంతి బ్యాంకులోనే జరిగినట్లు గుర్తించిన అధికారులు బ్యాంకు ఛైర్మన్ నివాసంలో సోదాలు చేస్తున్నారు.

సీఆర్పీఎఫ్ బలగాల పహరాలో  తనిఖీలు

బాలానగర్ రాజు కాలనీలో సీఆర్పీఎఫ్ బలగాల పహరాలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి నివాసంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తాళాలు లేవని చెప్పడంతో బీరువాలు, లాకర్లను అక్బర్ అనే వ్యక్తితో ఓపెన్ చేయించారు. అందులో కొన్ని బట్టలు ఇతర సామాగ్రి మాత్రమే ఉన్నాయని నగదు దొరకలేదని సదరు వ్యక్తి చెప్పాడు. ఇప్పటికీ గోపాల్ రెడ్డి నివాసంలో తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.