దేశ వ్యాప్తంగా 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జెండా ఆవిష్కరణలతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ్వెన్నెల త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. దేశ సరిహద్దులో కూడా గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) సైనికులు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. లడఖ్ ప్రాంతంలో -25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద జాతీయ జెండాను చేత పట్టుకుని వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐటీబీపీ తన అధికారిక ట్విటర్ లో షేర్ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ మంచులో సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతున్నారు.
లడఖ్ వద్ద 17,000 ల అడుగుల ఎత్తులో జెండాను ఎగురవేసేందుకు చలిని సైతం లెక్క చేయకుండా.. మంచులో నిలబడి భారత్ మాతా కి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఐటీబీపీ ఈ వీడియోని షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో వ్యూస్ , వందల సంఖ్యలో లైక్స్ , కామెంట్స్ వచ్చాయి. సైనికుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ చాలా మంది జాతీయ జెండాతో తాము దిగిన ఫోటోలను కామెంట్స్ తో జత చేస్తూ వారికి రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
भारत माता की जय !
वन्दे मातरम…Indo-Tibetan Border Police (ITBP) men and women with national flag at Ladakh heights celebrating #Republic Day 2021 at 17,000 feet. Temperature is minus 25 degree Celsius.#RepublicDay2021 #RepublicDay #RepublicDayIndia pic.twitter.com/dCw5HoE6FR
— ITBP (@ITBP_official) January 26, 2021