భద్రాచలం, వెలుగు : భద్రాచలం, పరిసర ప్రాంతాల్లో పెద్ద స్థాయి వ్యాపారం నుంచి చిన్నస్థాయి వ్యాపారం చేసుకుంటున్న ప్రతీ ఒక్కరూ వ్యాపారాన్ని బట్టి లైసెన్స్, రిజిస్ట్రేషన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఆధ్వర్యంలో గురువారం ఐటీడీఏలో నిర్వహించిన రిజిస్ట్రేషన్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
వ్యాపారులకు లైసెన్స్, రిజిస్ట్రేషన్లు అందించిన అనంతరం పీవో మాట్లాడారు. ఎఫ్ఎస్ఎస్ఐ ద్వారా ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ మంజూరు అవుతుందన్నారు. లైసెన్స్ ఉంటే వ్యక్తిగత రుణాలు పొందడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ తదితరులు పాల్గొన్నారు.
