
- ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించారు. ఐటీడీఏలో శుక్రవారం జరిగిన 29 పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన వైద్యసేవలపై రివ్యూ చేశారు. మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్తో కో ఆర్డినేట్ చేసుకుని ఆస్పత్రికి వచ్చే రోగులకు మెడికల్ టెస్టులతో పాటు మందులను సకాలంలో అందజేయాలన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటింటికి వెళ్లి ఆదివాసీలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాకాలంలో నదులు, వాగులు పొంగుతాయని, గర్భిణుల విషయంలో అలర్ట్గా ఉండాలన్నారు. పీహెచ్సీల్లోనే నార్మల్ డెలివరీలు జరిపేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేయొద్దని హెచ్చరించారు.
జ్వరాల విషయంలో ఎప్పటికప్పుడు టెస్ట్ లు చేయించాలని, మలేరియా, డెంగ్యూ జ్వరాల పట్ల అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు.ఈ మీటింగ్లో డిప్యూటీ డీఎం హెచ్వో చైతన్య, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, మెడికల్ఆఫీసర్లు జయలక్ష్మి, మధువరన్, పుల్లారెడ్డి, తేజశ్రీ పాల్గొన్నారు.
స్టూడెంట్స్ కు సన్మానం
ఐటీడీఏ విద్యాసంస్థల్లో చదివి జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్ లో రాణించిన ట్రైబల్ స్టూడెంట్లను ఐటీడీఏ పీవో బి.రాహుల్శుక్రవారం సన్మానించారు. ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్లు సంపాదించిన వారిని అభినందించారు. 25 మంది స్టూడెంట్లు, వారిని ట్రైనింగ్ఇచ్చిన సిబ్బందిని పీవో శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు.