ఏజెన్సీలో మెరుగైన వైద్యం అందించాలి : ఐటీడీఏ పీవో రాహుల్

ఏజెన్సీలో మెరుగైన వైద్యం అందించాలి : ఐటీడీఏ పీవో రాహుల్
  • ఐటీడీఏ పీవో రాహుల్​

భద్రాచలం, వెలుగు : మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ ఆదేశించారు. ఐటీడీఏలో శుక్రవారం జరిగిన 29 పీహెచ్​సీల మెడికల్​ ఆఫీసర్ల సమావేశంలో ఆయన వైద్యసేవలపై రివ్యూ చేశారు. మెడికల్​ ఆఫీసర్లు, స్టాఫ్​తో కో ఆర్డినేట్​ చేసుకుని ఆస్పత్రికి వచ్చే రోగులకు మెడికల్​ టెస్టులతో పాటు మందులను సకాలంలో అందజేయాలన్నారు. 

సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటింటికి వెళ్లి ఆదివాసీలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాకాలంలో నదులు, వాగులు పొంగుతాయని, గర్భిణుల విషయంలో అలర్ట్​గా  ఉండాలన్నారు. పీహెచ్​సీల్లోనే నార్మల్​ డెలివరీలు జరిపేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్​ చేయొద్దని హెచ్చరించారు. 

జ్వరాల విషయంలో ఎప్పటికప్పుడు టెస్ట్ లు చేయించాలని, మలేరియా, డెంగ్యూ జ్వరాల పట్ల అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు.ఈ మీటింగ్​లో డిప్యూటీ డీఎం ​హెచ్​వో చైతన్య, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్​ రామకృష్ణ, మెడికల్​ఆఫీసర్లు జయలక్ష్మి, మధువరన్, పుల్లారెడ్డి, తేజశ్రీ పాల్గొన్నారు.

స్టూడెంట్స్ కు సన్మానం

ఐటీడీఏ విద్యాసంస్థల్లో చదివి జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్ లో రాణించిన ట్రైబల్ స్టూడెంట్లను ఐటీడీఏ పీవో బి.రాహుల్​శుక్రవారం సన్మానించారు. ఆల్​ ఇండియా ర్యాంకులు సాధించి ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్లు సంపాదించిన వారిని అభినందించారు. 25 మంది స్టూడెంట్లు, వారిని ట్రైనింగ్​ఇచ్చిన సిబ్బందిని పీవో శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు.