
దేశంలో రైతుల ధీనావస్థపై ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సంతోషంగా దీపావళి జరుపుకోలేని పరిస్థితుల్లోకి రైతులను నెట్టారని ఆరోపించారు. ఖరీఫ్ పంటలను కనీస మద్దతు ధర కంటే 22.5శాతం తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితులున్నాయని చెప్పారు. రైతులు రెండు విధాల దోపిడీకి గురవతున్నారన్నారు.
ఈ విధానం ఆగాల్సిందేనన్నారు సోనియా. పంటలకు మంచి ధర కల్పించడమే రాజధర్మమని లెటర్ విడుదల చేశారు. తక్కువ ధరలకు పంటలు అమ్ముకోవాల్సి రావడం వల్ల ఖరీఫ్ సీజన్ లో దేశ రైతులు 50 వేల కోట్లు నష్టపోతున్నారని చెప్పారు.