
ముంబై: అమితాబ్బచ్చన్కు కరోనా నెగటివ్ వచ్చిందని, ఫ్యాన్స్ ప్రేయర్స్ వల్ల అది సాధ్యమైంది అంటూ ఒక మీడియా సంస్థ వేసిన వార్తను బాలీవుడ్ బిగ్బీ ఖండించారు. అది ఫేక్ అని గురువారం ట్వీట్ చేశారు. “ నెగటివ్ అని వచ్చిన వార్త పూర్తి అవాస్తవం. బాధ్యతా రాహిత్యం. పూర్తి అబద్దం” అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆ న్యూస్ చానల్ పోస్ట్ చేసిన ట్వీట్ను షేర్ చేశారు. అమితాబ్ బచ్చన్కు నెగటివ్ వచ్చిందని, ఫ్యాన్స్ ప్రార్థనల వల్ల ఆయన కోలుకున్నారని ఒక దర్శకుడు చెప్పినట్లు జాతీయ మీడియా సంస్థ ప్రచారం చేసింది. దీంతో దానిపై బిగ్బీ స్పందించి వివరణ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్, ఆయన అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య, మనువరాలు ఆరాద్యకు కరోనా పాజిటివ్ రావడంతో ముంబైలోని నానావతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
.. this news is incorrect , irresponsible , fake and an incorrigible LIE !! https://t.co/uI2xIjMsUU
— Amitabh Bachchan (@SrBachchan) July 23, 2020