ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి: జేఏసీ నాయకులు

ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి: జేఏసీ నాయకులు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత పథకాన్ని స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. అయితే ఈ పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఏఐటీయుసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆటో మీటర్ల చార్జీలు పెంచారని... పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 7 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని తెలిపారు.

కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి.. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు స్వయం ఉపాధి పథకాలు అందించాలని కోరారు. తమ సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.