- శేరిలింగంపల్లి సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
చందానగర్, వెలుగు : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలే తనను గెలిపిస్తాయని ఆ పార్టీ శేరిలింగంపల్లి సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. బుధవారం ఓల్డ్ హఫీజ్ పేట గ్రామంలోని జనప్రియ, లేక్ వ్యూ అపార్ట్మెంట్లలో ఆయన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని జగదీశ్వర్గౌడ్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.