మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. మార్చి 29 వ తేది నాటికి పూర్తిగా రేషన్ అందుబాటులోకి ఉంటుందని, రేషన్ ఫ్రీగా ఇవ్వడమేక కాకుండా కేజీ పప్పును ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.1000 అందిస్తామని తెలిపారు.
పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని.. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు. గోడౌన్లు, ఫ్యాక్టరీలు అతి తక్కువ సిబ్బందితో నడపాలని సూచించారు సీఎం జగన్.