దేశంలో రాజ్యాంగం ఇచ్చిన సాంప్రదాయాల ప్రకారం ప్రధాని తర్వాత ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇవ్వాలన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఈ సంప్రదాయం పాటించారని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అవమానించేలా బీజేపీ వ్యవహరించింది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ సింహం.. సింహానికి సింహాసనం అవసరం లేదు.. సింహం ఎక్కడ కూర్చున్నా సింహమే అని అన్నారు జగ్గారెడ్డి.
జనవరి 27న గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజకీయ సంప్రదాయం ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలాంటి సంప్రదాయం వచ్చింది..? స్వాతంత్రం వచ్చిన తర్వాత.. నెహ్రూ..ఇందిరా గాంధీ... రాజీవ్ గాంధీ... సోనియా గాంధీలు సంప్రదాయాలు పాటించారు. ప్రధాని జెండా ఎగరేస్తే.. ప్రతిపక్ష నాయకుడు ముందు వరుసలో కూర్చోబెట్టేవారు. అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద... ప్రజలు ఇచ్చిన హక్కు. రిపబ్టిక్ డే వేడుకల్లో రాహుల్ గాంధీని మూడో లైన్ లో కూర్చోబెట్టి అవమానపరిచారు .. బీజేపీ ప్రవర్తన ప్రజలు గమనించాలి. మోదీ ప్రభుత్వం సాంప్రదాయాలు పక్కన పెట్టింది . రాహుల్ గాంధీ ఏం ఫీల్ కారు.. ఎందుకు అంటే రాహుల్ గాంధీ ఇంట్లోనే ప్రధాని పోస్ట్ పుట్టింది. మోదీ ఇంట్లో ప్రధాని పోస్ట్ పుట్టలేదు.. ప్రధాని పోస్టు పుట్టిందే రాహుల్ గాంధీ . న్యాయమైన పాలన...పేదలకు అండగా ఉండే పాలన.. అందించింది రాహుల్ గాంధీ కుటుంబం’.
‘ఐదో వరసలో కూర్చోబెట్టినా... రాహుల్ గాంధీ ఏం ఫీల్ కారు. 47 ఏండ్లు రాహుల్ గాంధీ కుటుంబం దేశాన్ని పాలించింది. రాహుల్ గాంధీ ఆలోచన... మాట ప్రవర్తన అంతా సింహం లాగ ఉంటుంది. సింహానికి సింహాసనం అవసరం లేదు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. మోదీ సింహాసనం మీద కూర్చుంటేనే ప్రధాని అంటారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో మోదీనీ పులి లెక్క వెంటాడింది.రాహుల్ గాంధీ కుటుంబం పై రాజకీయంగా కుట్రలు చేయడం మానుకోండి. వాజపేయి లాంటి వాళ్ళు పార్లమెంట్ లో ఉండాలి ..ప్రతిపక్షం సభలో ఉంటేనే లోటుపాట్లు తెలుస్తాయి అని ఇందిరాగాంధీ గౌరవం ఇచ్చేది. వాజ్ పేయి.. అద్వానీ లాంటి వాళ్లకు ముందు వరుసలో కూర్చోబెట్టి మర్యాద ఇచ్చారు ఇందిరా, రాజీవ్ గాంధీ. ఎందుకు సంప్రదాయాలు పక్కన పెడుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కి ఏం చెప్పదలచుకుంటున్నారు. ధర్మం అంటారు దాన్ని పాటించరు. దేవుడు అంటారు.. పద్ధతులు పాటించరు. ప్రధాన మంత్రులు వస్తారు పోతారు కానీ చరిత్రను కాలరాయలేరు. బీజేపీ ఎంత సేపు ప్రజల్లోకి చెడును ఎలా జొప్పించాలి అనేది చూస్తుంది. ప్రజలను ట్రాప్ చేయడం ఎలా అనేదే బీజేపీ పాలసీ.అంతకు మించి ఏం లేదు.’ అని జగ్గారెడ్డి మండిపడ్డారు.
